నిజందాగదుక్షణంఆగదు

Feb 08 2023, 16:25

హాత్ సే హాత్ జోడోయాత్ర లో పాల్గొన్న డాక్టర్ చెరుకు సుధాకర్

నకిరేకల్ నియోజకవర్గం

 హాత్ సే హాత్ జోడోయాత్ర పాదయాత్రను 2 వ రోజు నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించి స్థానిక సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకుంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న  

 TPCC ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ చార్జ్ కొండేటి మల్లయ్య గారు 

 మరియు

 వైస్ ప్రెసిడెంట్ చెరుకు సుధాకర్ గారు 

ఈ కార్యక్రమంలో

 టీపీసీసీ డెలికే సుంకరబోయిన నరసింహ యాదవ్ మాజీ ఎంపీపీ లింగాల మల్లేశ్వరి ఎంకన్న మాజి మండల పార్టీ అధ్యక్షులు రాచకొండ లింగయ్య గౌడ్ డిసిసి కార్యదర్శి యాస కరుణాకర్ రెడ్డి బొప్పని యాదగిరి నకిరేకంటే శ్రీను

వంటేపాక వెంకన్న స్వప్న వెంకటమ్మ సుంకర సైదులు మేడి నాగరాజు కొండ నారాయణ సిహెచ్ శ్రీరంగం కొండల్ గౌడ్ వనం స్వామి పున్న శ్రీను కోమటి యాదగిరి వనం వెంకట సత్తి చిట్టిపోలు కుమారస్వామి కొంగరి అంజయ్య మునుగోడు చంద్రయ్య సుంకరి సైదులు ఏర్పుల రవి మహిళా కాంగ్రెస్ నాయకురాలు కొండ అంజమ్మ సురుగు జ్యోతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 08 2023, 16:16

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బెంచీల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచిల పంపిణీ 

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సిమెంట్ బెంచిలను అందజేశారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, బెంచిలను ప్రారంభించారు. వారి వెంట కౌన్సిలర్లు పబ్బు సాయిశ్రీ సందీప్, గొగుల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 08 2023, 07:35

బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ

బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.

 ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించనుంది. కౌన్సిల్‌లో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ చేపడతారు. మన ఊరు - మన బడి, జంటనగరాల్లో సీసీటీవీ కెమేరాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ట్రాఫిక్ నిర్వహణ, ఆసరా ఫించన్లు, నకిలీ విత్తనాలు - ఎరువులు తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్సీలు వెలిచాల జగపతిరావు, జస్టిస్ ఎ. సీతారామ రెడ్డికి కౌన్సిల్ సంతాపం తెలపనుంది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల సలహా మండలి నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలోనే తెలిపారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర శాసనసభలో హరీశ్‌రావు, మండలిలో ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న శాసనసభకు సెలవు. తిరిగి ఇవాళ సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. దానికి రాష్ట్ర ఆర్థికమంత్రి సమాధానం చెబుతారు. 9, 10, 11 తేదీల్లో పద్దులపై చర్చ ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాలను సైతం నిర్వహిస్తారు. 12న ఆదివారం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. దానికి సభ ఆమోదం తెలపనుంది. అంతటితో సమావేశాలు ముగుస్తాయి.

నిజందాగదుక్షణంఆగదు

Feb 07 2023, 21:42

చేనేత పవర్లూమ్ కార్మికులకు నిరాశ మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్:తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్

చేనేత పవర్లూమ్ కార్మికులకు నిరాశ మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్

    రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్లో నామమాత్రంగా 50 కోట్లు మాత్రమే కేటాయించి చేనేత, పవర్ లూమ్ కార్మికులను నిరాశకు గురిచేశారని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్, తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండెంపల్లి సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

        రాష్ట్ర బడ్జెట్ పై మంగళవారం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో చేనేత బీమా కు మినహా ఇతర ఎలాంటి సంక్షేమ పథకాలు చేనేత సహకార సంఘాల అభివృద్ధి కోసం కార్మికులకు రంగు రసాయనాలు యారో సబ్సిడీ ల కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా చేనేత పవర్ లూమ్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి బడ్జెట్లో మొండి చేయి చూపడం విచారకరమని అన్నారు. చేనేత, పవర్ లూమ్ కార్పొరేషన్ లను ఏర్పాటుచేసి చైర్మన్ లను నియమించి ఉత్సవ విగ్రహాలుగా ఉంచారే తప్ప వాటి ద్వారా చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉపయోగపడే విధంగా నిధులు లేకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే రాష్ట్ర బడ్జెట్ ను సవరించి చేనేత, పవర్ లూమ్ కార్పొరేషన్లకు 1200 కోట్లు చొప్పున రెండు కార్పొరేషన్లకు 2400 కోట్లు నిధులు కేటాయించి కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.

       ఈ విలేకరుల సమావేశంలో చేనేత పవర్లు కార్మిక సంఘాల నాయకులు పెండేం రాములు, గంజి నాగరాజు, కర్నాటి శ్రీరంగం, రాపోలు వెంకన్న మధు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 07 2023, 21:31

ఈనెల 13న హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయండి

ఈనెల 13న హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయండి.

ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ చెయ్యకుండా మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా.... 

మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈనెల 13న జరుగు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చెయ్యడం కోసం చిట్యాల మండలం నేరడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో వడ్డేపల్లి రాజ పెంటయ్య, శంకర్ అధ్యక్షతన గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధిలుగా: MSP చిట్యాల మండల ఇన్చార్జులు మేడి శంకర్ మాదిగ, బకరం శ్రీనివాస్ మాదిగ, బొజ్జ చిన్న మాదిగ, బొజ్జ దేవయ్య మాదిగ హాజరై మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ చెయ్యకుండా మోసం చేస్తున్న బీజేపీ పార్టీతో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధం కావాలని, ఈనెల 13న రహదారి దిగ్బంధం చేసి మాదిగల సత్తా చూపించాలని పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో

వడ్డేపల్లి రాంబాబు, వడ్డేపల్లి రమేష్, వడ్డేపల్లి శంకర్, పెంటయ్య, బక్కమ్మ, లింగమ్మ, వడ్డేపల్లి ఎల్లయ్య, లక్ష్మమ్మ, మరియు నేరడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 07 2023, 21:26

హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి:TSJA రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి

రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ద్వారా ఇవ్వనున్న ఇంటి స్థలాల మాదిరిగానే అదేవిధంగా ఖమ్మంలో త్వరలో ఇవ్వబోతున్న విధంగానే రాష్ట్రంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో కొనసాగుతున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయంలో వీలైనంత తొందరగా స్పందించాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం ఇవ్వనున్న ఇంటి స్థలాల విషయంలో అర్హత లేని వారికి ఏనాడు వార్తలు రాయకుండా అక్రిడేషన్లు పొందుకున్న వారికి జర్నలిస్టులుగా గుర్తించి ఇంటి స్థలాలు ఇస్తే అలాంటి వారి లిస్ట్ బయటపెట్టి ప్రత్యేక ఉద్యమం చేపడుతామని తెలిపారు. అక్రిడేషన్ లతో సంబంధం లేకుండా వర్కింగ్ లో ఉండి ఇంటి స్థలాలు రాకుండా అణిచివేతకు గురైన ప్రతి ఒక్కరికి టీఎస్ జేఏ అండగా ఉంటుందని తెలిపారు.ఖమ్మం జిల్లాలో హైదరాబాదులో స్పందించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనువెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు,సూర్యాపేట పట్టణ ఉపాధ్యక్షుడు రవిచంద్ర నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Feb 07 2023, 16:45

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు: నల్గొండ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి.

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:

పట్టణం లో వివిధ కాలనీలలో రాత్రి సమయాలలో రోడ్లపై ఆవారాగా తిరుగుతూ, గుమిగుడి సిగరెట్లు తాగుతూ, చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిస్తూ పట్టుబడ్డ వారికి ఈ రోజు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. 

ఎవరైనా ఇలా పట్టుబడినట్లైతే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్ లలో అర్హత పొందుటకు ఇబ్బంది కలుగును. కనుక నేటి యువత స్నేహితుల ప్రభావం తో గానీ, ఇతర కారణాలతో గాని, చెడు మార్గంలోకి వెళ్లి జైలు పాలు కాకుండా, భవిష్యత్తును సన్మార్గం లో తీసుకెళ్లాలని,వారికి, వారి కుటుంబ సభ్యులకు, సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేలా ప్రవర్తన మార్చుకోవాలి అని హెచ్చరించడం జరిగింది.  మద్యం సేవిస్తూ పట్టుబడిన వారి పై చట్ట ప్రకారం కేసులు 6 నమోదు చేయబడినాయి.

*ప్రజలకు, పోలీస్ వాలంటీర్స్ కి టూ టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి. మీ ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అయితే వెంటనే 100 కి గాని, పి ఎస్ కి గాని సమాచారం ఇవ్వండి.

నిజందాగదుక్షణంఆగదు

Feb 07 2023, 16:29

సుకన్య సమృద్ధి యోజన మహమేళను సద్వినియోగం చేసుకోవాలి: సూర్యాపేట వెస్ట్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ కే.సైదిరెడ్డి

సుకన్య సమృద్ధి యోజన మహమేళను సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట,ఫిబ్రవరి 07:-ఈ నెల 9,10 తేదీల్లో జిలా వ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ లలో సుకన్య సమృద్ధి యోజన మహామేళా డ్రైవ్ ను ఆడ పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట వెస్ట్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ కె.సైదిరెడ్డి అన్నారు.మంగళవారం ఆయన సూర్యాపేట పట్టణంలో సుకన్య సమృద్ధి పథకం గురించి ప్రత్యేక క్యాంపెన్ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరలలోపు ఆడపిల్లల తల్లితండ్రులు,సంరక్షకులు సుకన్య సమృద్ధి ఖాతాకు అర్హులని ఈ పథకం ద్వారా ఖాతా తెరిచి డబ్బు జమచేసిన ఖాతా దారులకుదేశంలో ఏ పథకానికి లేని విదంగా ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుందన్నారు. పూర్తి వివరాలకు ప్రజలు తమ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట పోస్ట్ మాస్టర్ జయమ్మ,సిబ్బంది శుక్ల,రవిదాస్,ఉపేందర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 07 2023, 15:42

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును 3 వారాలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును 3 వారాలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ బి విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌ను కోరింది. గతంలో ఇచ్చిన తీర్పుపై 3 వారాలు సస్పెన్షన్ ఇవ్వాలని సింగిల్ జడ్జికి విజ్ఞప్తి చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా సమయం ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ కోరారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 07 2023, 14:17

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...

.......

.......

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లో సభండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ,

పెద్దగట్టు జాతరలో పాల్గొన్న భక్తుల మొహల్లో కనిపిస్తున్న చిరునవ్వు ,ఆనందమే దానికి తార్కాణం అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి....కుటుంబ సమేతంగా పెద్దగట్టు జాతరలో పాల్గొన్న జగదీష్ రెడ్డి లింగమంతుల స్వామివారికి నిర్వహించిన చంద్రపట్నం,కల్యాణ మహోత్సవం లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు...కోట్ల రూపాయలను వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో  భక్తులు చాలా సంతోషంగా స్వామివారి ని దర్శించుకుంటున్నారని మంత్రి అన్నారు..ఇప్పటి వరకు 12 లక్షల కు పైగా భక్తులు జాతరలో పాల్గొన్నారని తెలిపారు..రేపు ఎల్లుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని దానికి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు...ఆలయ కమిటీ సభ్యులు,ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు సమిష్టిగా పని చేస్తూ,జాతరలో ఎలాంటి అసౌకర్యం లేకుండా రేయింబవళ్లు పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు...పాడి పంటలతో, సిరి సంపదలతో, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మరిందని అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్ తో, తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు...లింగమంతుల స్వామివారి దయతో తెలంగాణ మరింత పురోగమించాలని జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.